హైదరాబాద్ : ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. ఓయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఫలితాలను విడుదల చేశారు. 19 సబ్జెక్టులకు గాను నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఈఫలితాల్లో మొత్తంగా 90. 94శాతం విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 11 -14 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించగా, 18వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు pgecet.tsche.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.