హైదరాబాద్: బీటెక్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన ఈసెట్ (ECET) వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియ నేటినుంచి ప్రారంభం కానుంది. బుధవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు స్లాట్లు బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 9 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 17వ తేదీన సీట్ల కేటాయింపు జరగనుంది. తదితర వివరాల కోసం tsecet.nic.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఈసెట్ ఫలితాలు గత నెల 12న విడుదల కాగా, 90.69శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ఈసెట్ కౌన్సెలింగ్ ద్వారా నేరుగా బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు పొందుతారు.