Barse Deva : మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బర్సే బాధ్యతలు నిర్వర్తించారు. మరో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను ఆయన చూశారు.
కాగా హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్గఢ్లోని ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలకపాత్ర పోషించారు. గురువారం తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి బర్సే దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు. బర్సే లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.