టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెండ్లయిన తర్వాత సినిమాలకు దూరమవుతుందన్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా కాజల్ పెండ్లి తర్వాత కూడా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాజల్ తాజాగా అక్కినేని నాగార్జునతో ఓ సినిమాకు సంతకం చేసినట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రంలో కాజల్ కీ రోల్ చేస్తుంది. హైదరాబాద్లో హై ఆక్టేన్ సీక్వెన్స్ షూట్ తర్వాత చిత్రయూనిట్ గోవాకు పయనమైంది. ప్రస్తుతం బీచ్ సిటీలో షూటింగ్ కొనసాగుతుంది.
గోవా షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన చిత్రీకరణ కోసం నాగ్ టీం హైదరాబాద్కు రానుంది. మార్చి 31 నుంచి కాజల్ షూటింగ్లో జాయిన్ కానుందట. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శరత్మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. కాజల్ తమిళంలో రెండు సినిమాలు లైన్ లో పెట్టడంతోపాటు టీవీ షో కూడా హోస్ట్గా వ్యవహరించనుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.