నందికొండ, నవంబర్ 29: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. నందికొండ హిల్కాలనీ లాంచీ స్టేషన్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి, లాంచీ స్టేషన్ మేనేజర్ హరిబాబు, నందికొండ ఎస్సై నర్సింహారావు జెండా ఊపి లాంచీని ప్రారంభించారు. నందికొండ నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన లాంచీ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుకున్నది. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీశైలంలో బయల్దేరి సాయంత్రానికి నాగార్జునసాగర్కు చేరుకోనున్నది. తొలిరోజు 20 మంది ప్రయాణికులతో వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బస్సులో వచ్చిన మరో 60 మంది పర్యాటకులతో నాగార్జునసాగర్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.