హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్కు విరామం ప్రకటిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి యథావిధిగా అన్ని కేంద్రాల్లోనూ టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. పండుగ వేళ నిర్లక్ష్యం వద్దని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా వేడుక జరుపుకోవాలని సూచించింది. సెకండ్ డోస్ విషయంలో నిర్లక్ష్యం వద్దని, రెండు డోసులు తీసుకున్నవారికే వైరస్ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొన్నది.