హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్శేఖర్ శర్మ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. టీటీడీ అభివృద్ధి చేస్తున్న పిల్లల దవాఖానకు విరాళం ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.