న్యూఢిల్లీ : ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులు, ఆర్ధిక అనిశ్చితి వెంటాడుతుండటంతో టెక్ దిగ్గజాల నుంచి చిన్న కంపెనీల వరకూ మాస్ లేఆఫ్స్కు (Layoffs) తెగబడుతున్నాయి. సంక్లిష్ట సమయంలో కంపెనీలను సజావుగా నడిపేందుకు ఖర్చులకు కళ్లెం పేరుతో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు.
తాజాగా గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీడీడబ్ల్యూ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది. తొలగించిన ఉద్యోగులకు కంపెనీ పరిహార ప్యాకేజ్ అమలు చేస్తున్నా బాధిత ఉద్యోగులను నాన్-డిస్క్లోజర్ ఒప్పందంపై సంతకాలు చేయాలని కోరుతోందని సమాచారం. సీడీడబ్ల్యూలో కొలువులు కోల్పోయిన పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తాము కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని పోస్టులు పెడుతున్నారు.
ఇది బాధాకరమైన రోజు…సీడీడబ్ల్యూలో నా ఉద్యోగ పర్వానికి ఇదే చివరి రోజని కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్లో తాను బాధితుడినని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. క్లౌడ్, ఐటీ మేనేజ్మెంట్ విభాగంలో తాను నూతన అవకాశాల కోసం అన్వేషిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ రోజు ఎంతో క్లిష్టమైన రోజని, కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్లో తాను ఉద్యోగం కోల్పోయానని, అజూర్ క్లౌడ్, ఐటీ స్పేస్లో నూతన అవకాశాల కోసం వేచిచూస్తున్నానని మరో బాధిత ఉద్యోగి రాసుకొచ్చారు.