బెంగళూరు: హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లిం సహా హిందూయేతర ఏ మతస్తులకు అనుమతి లేదని బీజేపీ అధికారంలోని కర్ణాటక సర్కారు పేర్కొంది. హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్సీఆర్ఈ) యాక్ట్, 2002లోని 12వ నిబంధన ప్రకారం ఈ నిర్ణయం సహేతుకమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి ఇటీవల ప్రకటన చేశారు. కర్ణాటక తీర జిల్లాల్లోని ఆలయ ప్రాంగణాల్లో ముస్లింల దుకాణాలను తొలగిస్తున్న ఘటనలను ఉటంకిస్తూ కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.