శ్రావణ్, అనిల్, క్రిస్టెన్ రవలి, అపర్ణ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తీరం’. అనిల్ అనమడుగు దర్శకుడు. ఎం. శ్రీనివాసులు నిర్మాత. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. వారధి దాటని ఓ రాముడి కథ ఇది. ఓ స్త్రీ కోసం జరిగిన యుద్ధంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు.