హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన వెలుగులు కనిపించాయి. ఈ వెలుగులను చూసి పలువురు ఉల్కాపాతంగా భావించారు. వీటిని సెల్ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే, అది ఉల్కాపాతం కాదని, చైనా రాకెట్ చాంగ్జెంగ్3బీ అవశేషాలని అమెరికా శాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవాల్ ట్వీట్ చేశారు. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన సమయంలో పేలిపోవడంతో వెలువడిన కాంతి అని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్, అకోలా, జల్గావ్, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఖర్గోన్, ఝబువా, తెలంగాణలోని ఆసిఫాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వెలుగులు కనిపించాయి. అయితే, వీటిని చూసి పలువురు ఉల్కాపాతమని భావించారు. గతేడాది ఫిబ్రవరిలో చైనా చాంగ్జెంగ్ సిరిస్లో భాగంగా ప్రయోగించిన రాకెట్.. శకలాలు మళ్లీ భూమి వాతావరణంలోకి రాగా.. మండిపోయాయని జోనాథన్ పేర్కొన్నారు. వీటివల్ల జరిగే హానీ తక్కువగా ఉంటుందని, అయితే, రాకెట్ శకలాలు శనివారం కిందకు వస్తాయని తాము ముందుగానే ఊహించామని పేర్కొన్నారు. ఈ రాకెట్ రీఎంట్రీ స్టేజ్గా తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.
#WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R
— ANI (@ANI) April 2, 2022