న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 30న రాష్ట్రంలో ఎస్టీలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో జారీ చేసిందని ఆధార్ సొసైటీ, గిరిజన ఉద్యోగుల అసోసియేషన్, ఆదిమ ఆదివాసుల సంక్షేమ-హకుల పరిరక్షణ సంఘం, కోడెపాక రోహిత్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బంజారా, లంబాడా, సుగాలీలను ఎస్టీలో చేర్చవద్దని తాము వేసిన పిటిషన్ విచారణలోనే ఉండగానే రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయడం అన్యాయమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. వారి వాదనలను తోసిపుచ్చిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ దీపాంకర్దత్తాతో కూడిన ధర్మాసనం.. హైకోర్టును ఆశ్రయించుకొనే స్వేచ్ఛను కల్పించింది.