రామంతాపూర్: రామంతాపూర్, మీర్పేట్- హెచ్బీకాలనీ, మల్లాపూర్, చిలుకానగర్, ఉప్పల్ డివిజన్లలోని మరిన్ని కాలనీల క్రమబద్ధీకరణపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం పలువురు కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీల ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. డివిజన్లలోని సర్వే నంబర్లు 83,85,152,,153, 154లోని ప్రజలు దీర్ఘకాలంగా క్రమబద్ధీకరణ కోసం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాసు, గీతాప్రవీణ్ ముదిరాజ్, నాయకులు గడ్డం రవికుమార్, పలు కాలనీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.