కామారెడ్డి :
గిరిజనుల కోసం సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలు మరవలేనివని
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాన్సువాడ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సేవాలాల్ మహరాజ్ అధికారిక జయంతి వేడుకలకు స్పీకర్ ముఖ్య అథిగా హాజరయ్యారు.
ఉత్సవాల్లో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లంబాడీల సంక్షేమం కోసంరాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. గిరిజనులు, అటవీశాఖ మధ్య ఉన్న అటవీ భూముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. ఎ శరత్, నటుడు చమ్మక్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు