సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముక ప్రశాంత్ దర్శకుడు. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్రెడ్డి, శరత్చంద్ర, చంద్రు మనోహర్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 3న విడుదలకానుంది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ను హీరో అడివి శేష్ ఆవిష్కరించారు. ఇదొక ఫ్యామిలీ వేడుకలా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్లాప్స్తో పాటు క్యాష్ తీసుకొచ్చే చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకుంటుంది’ అన్నారు.
‘కొత్తవారితో సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఛాయ్ బిస్కట్ ఫిల్మ్ ప్రొడక్షన్ మొదలుపెట్టాం. మరో నాలుగు సినిమాలు కూడా ఫైనలయ్యాయి. సుహాస్లోని అద్భుతమైన నటుణ్ణి ఆవిష్కరించే చిత్రమిది. పిల్లలందరూ పేరెంట్స్తో కలిసి ఈ సినిమా చూడాలని కోరుతున్నా’ అని నిర్మాత అనురాగ్ రెడ్డి పేర్కొన్నారు. సుహాస్ మాట్లాడుతూ ‘థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మన హృదయాల్ని వెంటాడే చిత్రమిది. కథలో అంతటి భావోద్వేగాలుంటాయి. నా తొలి థియేట్రికల్ రిలీజ్ మూవీ ఇదే కావడం సంతోషంగా ఉంది’ అన్నారు.