విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఒకప్పుడు నల్లగొండ జిల్లా.. కాళ్లు, చేతులు వంకర్లు పోయిన జిల్లా. ఫ్లోరైడ్ జిల్లా. అలాంటి జిల్లాలో ఈ ఏడాది ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు. తెలంగాణ ఫ్లోరైడ్ను తరిమేసిందని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేసీఆర్ అద్భుత పరిపాలన అంటే ఇది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంస్కరణలపై మంత్రి కేటీఆర్ ప్రతిపాదించిన తీర్మానాన్ని జగదీశ్రెడ్డి బలపరిచారు. విద్యుత్తు రంగంలో ఉత్తమ ప్రగతి సాధించామని, వలసల జిల్లాగా పేరున్న మహబూబ్నగర్కు నేడు పక్క జిల్లాలు, రాష్ర్టాల నుంచి 20 లక్షల మంది వలస వచ్చారని చెప్పారు. దేశానికి కాంగ్రెస్ చీకటి ఇచ్చి పోయిందని, బీజేపీ ధరలు పెంచి పగలే చీకట్లు తెచ్చిందని విమర్శించారు. అవి వెలుగులిచ్చే పార్టీలు కావని, వెలుగులను పంచేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేని స్పష్టంచేశారు.