చెన్నై: రెండేండ్ల పిల్లలంటే అప్పుడప్పుడే మాటలు నేర్చుకొనే వయసు. కానీ, తమిళనాడుకు చెందిన ఓ బాలుడు నాయకుల పేర్లు, పండ్లు, తమిళ అక్షరాలు, అంకెలు. వాహనాల నంబర్లు, ఇంగ్లిష్ నెలలు, తమిళ నెలలు, రాష్ర్టాలు-వాటి రాజధానులు కూడా గడగడా చెప్పేస్తాడు. శివగంగ జిల్లా తిరుప్పువనానికి చెందిన బాలాజీ, నందిని దంపతుల కొడుకు మయన్కు ఒక్కసారి ఏదైనా చెప్తే దాన్ని ఏ క్షణమైనా అప్పజెప్పేంత జ్ఞాపకశక్తి ఉన్నది. ఆ పిల్లగాడి టాలెంట్కు సంబంధించిన ఆధారాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపగా, అందులోనూ చోటు సంపాదించాడు.