ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్లు శుభారంభం చేశారు. ఢాకా వేదికగా ఆదివారం ప్రారంభమైన టోర్నీలో మన ఆర్చర్లు రికర్వ్ మిక్స్డ్, కాంపౌండ్ విభాగాల్లో రెండో స్థానంలో నిలిచారు. మహిళల కాంపౌండ్ విభాగంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ నాలుగో స్థానంలో నిలువగా, పురుషుల కాంపౌండ్ విభాగంలో యువ ఆర్చర్ రిషబ్ యాదవ్ 356 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించాడు. అభిషేక్ నాలుగో స్థానంలో నిలిచాడు. రికర్వ్ విభాగంలో కపిల్ (675), ప్రవీణ్ జాదవ్ (670), పార్థ్ సోలంకి (670) వరుసగా ఐదు, ఆరు, ఏడో స్థానాలు దక్కించుకున్నారు. ప్రపంచ యూత్ చాంప్ కోమలిక బారి ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. .