హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గృహ హింస, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. గృహ హింసకు గురవుతున్న మహిళలకు తక్షణ సాయం కోసం కేంద్రం 2013లో 181 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ ఏడాది మార్చి 31 వరకు మొత్తం 70,17,925 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి 11,21,711 ఫిర్యాదులు అందినట్టు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ తెలిపింది. తెలంగాణ నుంచి 181 నంబర్కు 89,843 మంది ఫిర్యాదు చేశారు.