ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టు మూడవ రోజు కోహ్లీ, బెయిర్స్టో మధ్య స్లెడ్జింగ్ జరిగింది. బెయిర్స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొన్ని కామెంట్ చేశాడు. ఆ సయమంలో ఇద్దరూ ఏదో అనుకున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ ఆరంభంలో బెయిర్స్టో తడబడ్డాడు. 61 బంతుల్లో 13 రన్స్ మాత్రమే చేసి స్కోరింగ్ కోసం ఇబ్బందిపడ్డాడు. అయితే ఆ సమయంలో కోహ్లీ స్లెడ్జింగ్కు దిగాడు. ఇక తర్వాత సీన్ మారింది. బెయిర్స్టో తన బ్యాటింగ్ శైలిని మార్చేశాడు. భారీ షాట్లతో అలరిస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత కేవలం 79 బంతుల్లో 93 రన్స్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్లో బెయిర్స్టో 106 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లీ స్లెడ్జింగ్ దిగిన అంశంపై బెయిర్స్టో రియాక్ట్ అయ్యాడు. స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. తాము పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నామని, ఇదో చిన్న సరదా లాంటిదని, కానీ మైదానంలో ఇద్దరమూ బలమైన పోటీదారులమని, అక్కడ అదే జరిగిందని, రెండు జట్లు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయని, ఇద్దరమూ కాంపిటీటర్లమని తెలిపారు. ఆటలో పోటీతత్వం ఉంటేనే .. ఉత్తమ ఆట బయటకు వస్తుందన్నాడు. జట్టును గండం నుంచి గట్టెక్కించాలంటే ఏది ఎదురైనా చేయాలని, ఇవన్నీ ఆటలో సహజమే అని బెయిర్స్టో అన్నాడు.
"We're fiercely competitive." 💪
Jonny Bairstow and Virat Kohli had an old-fashioned battle of words on day three of the fifth Test between England and India. 👇 pic.twitter.com/z3XS2JdsOG
— Sky Sports News (@SkySportsNews) July 3, 2022