హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అభ్యర్థులకు ఈ నెల 4 నుంచి జూన్ 5 వరకు టీశాట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సీఈవో రాంపురం శైలేశ్రెడ్డి తెలిపారు. పేపర్ 1 (ఉ.8నుంచి 8.30 గంటలు), పేపర్ 2 (ఉ.8. 30నుంచి 9గంటలు)కు 120 ఎపిసోడ్లను ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ మెథడాలజీ, సోషల్స్టడీస్ పాఠ్యాంశాలు, గణితం, సైన్స్, ఈవీఎస్, బయాలజీ, చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తదితర సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. వారం పాటు ఓరియంటేషన్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు 12 పేపర్లపై ప్రత్యేక అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని వెల్లడించారు. పోటీ పరీక్షల అవగాహన తరగతులతో పాటు మాక్ టెస్ట్, (క్విజ్) ఇంట్రెస్టింగ్ జనరల్ నాలెడ్జ్ పేరుతో ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి టీ-శాట్ వెబ్సైట్, చానళ్లు, యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామని శైలేశ్రెడ్డి తెలిపారు.