ముంబై: నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు తాత్కాలిక ఊరట లభించింది. 200 కోట్ల బెదిరింపు కేసులో జాక్వెలిన్కు మధ్యంతర బెయిల్ను ఢిల్లీ కోర్టు మంజూరీ చేసింది. ఈ కేసులో కాన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడు. 50 వేల పూచీకత్తుపై పాటియాలా కోర్టు జాక్వెలిన్కు తాత్కాలిక బెయిల్ను ఇచ్చింది. ప్రత్యేక జడ్జి శైలేంద్ర మాలిక్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మళ్లీ అక్టోబర్ 22వ తేదీన విచారణ ఉంటుంది. గత వారం నటి జాక్వెలిన్ను ఢిల్లీలోని ఆర్థిక నేరాల శాఖ ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. వసూళ్ల కేసులో జాక్వెలిన్ స్టయిలిస్ట్ లేపాక్షిని కూడా ఢిల్లీ పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి.