సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అమ్రిత్ మహోత్సవ్ను నిర్వహిస్తోంది. ఢిల్లీ కేం ద్రంగా జరుగుతున్న ఈ ఉత్సవ్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభా గం తెలంగాణ రాష్ట్రలో డిజిటల్ టెక్నాలజీ పరంగా తీసుకువచ్చిన రకరకాల ఆవిష్కరణలను, అప్లికేషన్లను ఇక్కడి స్టాల్లో ఏర్పాటు చేశారు.
ఈ సదస్సులో జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అమలు చేయబడిన 75 డిజిటల్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. దీనిపై ఒక డిజిటల్ పుస్తకాన్ని రూపొందించి ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్(ఫెస్ట్), టీ-చిట్స్ (అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ యూజింగ్ బ్లాక్ చైయిన్ అంశాలు ఇందులో ఉన్నాయి. కాగా, తెలంగాణ ఐటీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లో డిజిటల్ తెలంగాణలో భాగంగా రూపొందించిన మొబైల్ యాప్లు టీ యాప్ పోలియో, టీ వ్యాలెట్లను ప్రదర్శించారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ వెస్ట్ మెనేజ్మెంట్, ఐఓటీ, డ్రోన్, బ్లాక్ చైయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), స్పీచ్ టెక్ వంటి టెక్నాలజీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ ఫ్రేమ్ వర్క్లను ప్రదర్శించారు. వీటితో పాటు ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి.