హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో పాల్గొంటున్న జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి చేసింది.
వైద్య, పారిశుధ్య, పోలీసులు విభాగాలను గుర్తించిన తీరుగానే జర్నలిస్టులను పరిణించాలని కోరింది.
ఇప్పటికే బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాయని గుర్తు చేసింది.
ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తిస్తే అనారోగ్యం బారినపడిన, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశముందని టీయూడబ్ల్యూజే పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.