ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్మార్ ఖాన్’. గోగణ దర్శకుడు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. ప్రస్తుతం గోవాలో హీరో, హీరోయిన్పై పాటను చిత్రీకరిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పాయల్ రాజ్పుత్ పాత్ర కూడా సర్ప్రైజింగ్గా వుంటుంది. గ్లామర్తో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రను ఆమె పోషిస్తుంది. గోవాలో చిత్రీకరిస్తున్న రొమాంటిక్ పాట యువతరాన్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది’ అన్నారు. సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్సింగ్, పూర్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్.