హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): బీసీసీఐ అనుమతి లేకుండానే టీజీ20 లీగ్ నిర్వహిస్తూ, రూ.46 కోట్లకుపైగా అనధికారిక నిధుల వసూళ్లకు పాల్పడిందని ఆరోపిస్తూ హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి దారం గురువా రెడ్డి శనివారం సీఐడీ డీజీ చారు సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ లీగ్కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని, తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఫోరెన్సిక్ విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు.
ఈ లీగ్కు బీసీసీఐ అధికారికంగా ఆమోదం తెలిపినట్లు నిందితులు మీడియా, కార్పొరేట్ వర్గాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని టీసీఏ వాదిస్తోంది. అలాగే లీగ్ పేరిట ఎలాంటి ఆడిటింగ్ లేని, అనధికారిక కరెంట్ అకౌంట్ను తెరిచి కార్పొరేట్ నిధులను వసూలు చేశారని ఆరోపించింది.