హ్యూస్టన్: వరుస విజయాలతో భారత ప్యాడర్లు ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. మనికా బాత్రా- సాతియాన్, శరత్ కమల్-అర్చనా కామత్ జోడీలు రౌండ్ 16లోకి ప్రవేశించాయి. శుక్రవారం మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో మనిక-సాతియాన్ ద్వయం 3-1తో అడ్రియానా డియాజ్-బ్రియాన్(ప్యూర్టోరికో) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో శరత్-అర్చన జంట 3-2తో ఒమర్ అస్సార్-దినా మెశ్రఫ్ (ఈజిప్ట్) ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సాతియాన్, అరుణ ఖాద్రీ (నైజీరియా) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. మహిళల డబుల్స్లో మనిక-అర్చన జోడీ 3-0తో మార్గో-నథాలీ (బెల్జియం) జంటను చిత్తుగా ఓడించి తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్లో శరత్-సాతియాన్ జోడీ స్వీడన్ జంట చేతిలో ఓడిపోయింది.