న్యూఢిల్లీ: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) యూత్ కంటెండర్ అండర్-13 టోర్నీ టైటిల్ను భారత వర్ధమాన ప్యాడ్లర్ హాసిని మథన్రాజన్ చేజిక్కించుకుంది. అంతర్జాతీయ టోర్నీలో ఒకేసారి రెండు పతకాలు ఖాతాలో వేసుకుని హాసిని సత్తా చాటింది. ఆస్ట్రియా వేదికగా ఈనెల 1-3 మధ్య జరిగిన మెగాటోర్నీలో స్వర్ణంతోపాటు కాంస్య పతకం కొల్లగొట్టింది. అండర్-13 బాలికల ఫైనల్లో హాసిని 11-3, 7-11, 9-11 ,11-0 ,11-8తో ఆండ్రియా బైసు (రోమేనియా)ను చిత్తు చేసి చాంపియన్గా నిలిచింది. అండర్-15 విభాగంలో కాంస్యంతో మెరిసింది. సెమీస్లో యో ఎరిన్ (కొరియా) చేతిలో ఓటమిపాలై మూడో స్థానంలో నిలిచింది.