రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు సరిగా రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది.
తాజాగా తాప్సీ సినిమాల్లో పురుషాధిక్యత గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని… ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక టాప్ యాక్టర్ ను నిర్మాతలు సంప్రదించారని… అయితే సదరు హీరో ఒప్పుకోలేదని చెప్పింది. అతనితో నేను ఇంతక ముందు పని చేశాను. చాలా పెద్ద స్టార్. నాతో నటించడానికి అభద్రతగా ఫీల్ కావడం నాకు చాలా బాధను కలిగించింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది.
ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే వారు ఆ సినిమా చేయడానికి ఇష్టపడలేదంటూ తాప్సీ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘రష్మీ రాకేట్’ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది.