హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ వీ ప్రవీణ్రావు ప్రతిష్ఠాత్మక ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 8న జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్చార్డీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.