నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ మాజీ సలహాదారుడు, ఆస్ట్రేలియా ప్రొఫెసర్ సీన్ టర్నల్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. గత ఏడాది ఫిబ్రవరిలో యంగూన్లో సీన్ టర్నల్ను అరెస్టు చేశారు. సూకీ ప్రభుత్వాన్ని జుంటా సైన్యం కూల్చిన విషయం తెలిసిందే. అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ను ఉల్లంఘించిన కేసులో సూకీతో పాటు సీన్ టర్నల్పై అభియోగాలు నమోదు చేశారు. గురువారం జరిగిన కోర్టు విచారణలో ఇద్దరికీ శిక్షలను ఖరారు చేసింది. మిలిటరీ కోర్టులో విచారణ కొనసాగింది. ఇదే కేసులో సూకీకి మూడేళ్ల శిక్ష ఖరారైంది. ఇప్పటికే మిలటరీ ప్రభుత్వం పలు కేసుల్లో సూకీకి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది.ఇంకా పలు కేసుల్లో శిక్ష పెండింగ్లో ఉంది. ఒకవేళ అన్ని కేసుల్లో శిక్ష విధిస్తే, ఆమె దాదాపు 200 ఏళ్ల పాటు జైలులోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.