వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుల వివాహ మహోత్సవం
బాలాలయంలో ఉదయం తిరుకల్యాణం
రాత్రి వైభవోత్సవంగా కల్యాణ వేడుక
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల,ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి
యాదాద్రి, మార్చి 22: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టం కల్యాణోత్సవం సోమవారం
ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. ఉదయం 11.06 గంటలకు బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 7.30 గంటలకు కొండకింద ఉన్న పాత ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోవేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమవైభవోత్సవ కల్యాణం నిర్వహించారు.
పట్టువస్ర్తాల సమర్పణ
యాదాద్రీశుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు డాలర్ శేషాద్రి, యాదాద్రి ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తికి పట్టువస్ర్తాలను అందజేశారు. సాయంత్రం నిర్వహించిన వైభవోత్సవ కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దంపతులు యాదాద్రీశుడికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం వైభవోత్సవ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఈవో ఎన్. గీత పాల్గొన్నారు.