హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరోనాతో బడిమానేసిన పిల్లలను గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్త సర్వేను నిర్వహించనున్నది. మంగళవారం నుంచి ఫిబ్రవరి రెండు వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు. సర్వేలో భాగంగా 6 -14, 15-19 ఏండ్ల మధ్య వయస్కులతోపాటు దివ్యాంగ పిల్లల వివరాలను సేకరించి వాటిని ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు.