త్రిసూర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సురేశ్ గోపీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ త్రిసూర్లో నామినేషన్ వేశారు. బీజేపీ టికెట్పై ఆయన పోటీలోకి దిగుతున్నారు. ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరనున్నాయి. ఇవాళ తన ట్విట్టర్ పేజీని కూడా పబ్లిక్ చేశారు. తన అభిమానులకు దగ్గర ఉండాలని భావిస్తున్నట్లు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. గత ఏడాదే సురేశ్ గోపి.. ఫోటో షేరింగ్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్లో చేరారు. నిజానికి తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని, కానీ అధిష్టానం సూచన మేరకు పోటీలోకి దిగుతున్నట్లు ఇటీవల సురేశ్ గోపీ తెలిపారు. కొచ్చిలో గత కొన్ని రోజుల నుంచి ఆయన న్యూమోనియా చికిత్స పొందుతున్నారు. నాలుగు స్థానాల నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చారని, కానీ మోదీ నిర్ణయం ప్రకారమే తాను త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నట్లు గోపి వెల్లడించారు.