న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో సుమిత్ కుందు సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. సోమవారం జరిగిన పురుషుల 75కిలోల తొలి రౌండ్లో సుమిత్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్షిప్ రజత విజేత బిజమోవ్(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. కెరీర్లో రెండో సీనియర్ టోర్నీలో బరిలోకి దిగిన సుమిత్..తన కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న బిజమోవ్ను చిత్తుచిత్తుగా ఓడించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ యువ రెజ్లర్ పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా హుక్స్, జాబ్స్తో చెలరేగుతూ కీలక పాయింట్లు కొల్లగొట్టాడు. రెండో రౌండ్లో ఉక్రెయిన్ బాక్సర్ అలెగ్జాండర్ కిగ్జినియాక్తో సుమిత్ తలపడనున్నాడు. మరోవైపు నరేందర్ బెర్వాల్(92కి), వరిందర్సింగ్(60కి), లక్ష్య చాహర్(86కి) తొలి రౌండ్లో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల కేటగిరీలో శిక్ష(54కి), నీతు(48కి), అనామిక(50కి) మంగళవారం బరిలో దిగనున్నారు. యూరప్లో పురాతన టోర్నీగా పేరొందిన స్ట్రాంజా చాంపియన్షిప్లో భారత్ నుంచి ఈసారి 17 మంది బాక్సర్లు పోటీలో ఉన్నారు