హైదరాబాద్, జనవరి 20: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ ఫీల్డ్ జనరల్ మేనేజర్గా కేఎస్ఎన్వీ సుబ్బారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ బ్యాంక్ చెన్నై జోన్ డిప్యూటీ జోనల్ మేనేజర్గా వ్యవహరించిన సుబ్బారావు పదోన్నతిపై హైదరాబాద్ జోన్ జీఎంగా బాధ్యతలు చేపట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో 332 శాఖలున్నాయని, రూ. 31,550 కోట్ల వ్యాపారం ఉన్నదని బ్యాంక్ వివరించింది.