హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ 2-1 తేడాతో కెంక్రె ఎఫ్సీపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో శ్రీనిధి తరఫున చుంగుంగ లాల్(22ని), డేవిడ్ మునోజ్(60ని) గోల్స్ చేయగా, రంజీత్(19ని)..కెంక్రెకు ఏకైక గోల్ అందించాడు. ఈ విజయంతో ఎస్డీఎఫ్సీ ప్రస్తుతం 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నది.