హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక నీట్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో ఒకే మార్కుతో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఖండవల్లి శశాంక్, గొర్రిపాటి రుషిల్, సుయాశ్ అరోరా ఐదో ర్యాంకు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్-డైరెక్టర్ సుష్మ మంగళవారం తెలిపారు. పదిలోపు మూడు ర్యాంకులు, వందలోపు 21 ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆల్ క్యాటగిరీల్లో 10లోపు 8 ర్యాంకులు, 100లోపు 77 ర్యాంకులు పొందినట్టు వెల్లడించారు. విద్యార్థులను విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు అభినందించారు.