సుల్తాన్ బజార్, నవంబర్ 25: విధి నిర్వహణలో నిత్యం శ్రమించే ఉద్యోగులకు క్రీడలు కాస్త ఊరటనివ్వడంతో పా టు మానసిక ఉల్లాసాన్నిస్తాయని రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 7వ స్పోర్ట్ అండ్ గేమ్స్ 2021ను వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం, ఉల్లాసంగా క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ క్రీడల లో పాల్గొనడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీలలో 24 జట్లు పాల్గొంటున్నాయని అన్నారు.
ఈ మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్, ప్రధాన కా ర్యదర్శి ఆర్.ప్రతాప్, కేంద్ర సంఘం అసోసియేషన్ అధ్యక్షు డు ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకట్, నాల్గో తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ, కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, అధ్యక్షుడు ఎంఏ ముజీబ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, ఉమర్ఖాన్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సభ్యులు జానకి, చంద్ర శేఖర్, రామక్రిష్ణారెడ్డితో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.