హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సరఫరా, పంపిణీ, బిల్లింగ్ తదితర అంశాలపై ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ టీ శ్రీరంగారావు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులతో కలిసి సోమవారం ఈ యాప్ను ప్రారంభించారు. విద్యుత్తు వినియోగదారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఆయా సమస్యలను కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ పరిష్కరిస్తుందని తెలిపారు. గ్రీవెన్స్ సెల్లో పరిష్కారం లభించకపోతే అంబుడ్స్మెన్ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. యాప్లో వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించకపోతే సంబంధిత ఉద్యోగులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.