హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 34వ సౌత్జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. రెండోరోజు జాతీయస్థాయి పోటీలు హోరాహోరీగా జరిగాయి. అండర్-14, 16, 18, 20 విభాగాల వారీగా పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. మొత్తం 140 ఈవెంట్లలో నిర్వహించే ఈ క్రీడా పోటీల్లో అథ్లెట్లు బంగారు పతకాలే లక్ష్యంగా పరుగులు తీశారు. పాత రికార్డులను చెరిపివేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా ద్రోణచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడాల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అథ్లెటిక్స్ కోచ్ శ్రీమన్నారాయణ తదితరులు విజేతలకు మెడల్స్ అందజేసి అభినందించారు.
తెలంగాణకు పతకాల పంట..
సౌత్జోన్ అథ్లెటిక్స్ జాతీయస్థాయి చాంపియన్షిప్లో రెండోరోజు తెలంగాణ రాష్ర్టానికి పతకాల పంట పండింది. బాలురు అండర్-14లో ఏ వరుణ్(ట్రయాథ్లాన్, గోల్డ్), ఎల్ రాము(600 మీటర్స్లో గోల్డ్), సోము మాధవి(లాంగ్జంప్, సిల్వర్), జే దీక్షిత్(ట్రయాథ్లాన్, సిల్వర్) బాలికల అండర్-14లో ప్రణ తి(600 మీటర్స్, గోల్డ్), ఏ మనుశ్రీ(లాంగ్జంప్, సిల్వర్). బాలికల అండర్-16లో బీ వైశాలి(హెక్సాథ్లాన్, గోల్డ్), బీ కృష్ణవేణి(జావెలిన్త్రో, బ్రౌంజ్), బీ వైశాలి(లాంగ్జంప్, సిల్వర్), బాలురు అండర్-14లో పరుశరాం(600 మీట ర్స్, సిల్వర్), బాలురు అండర్-16లో ఎండీ అజారుద్దీన్(400 మీటర్స్, సిల్వర్), పీ గోపిచంద్(5కే వాక్, బ్రౌంజ్), సపావత్ దత్తు(లాంగ్జంప్, బ్రౌంజ్), బాలురు అండర్-18లో డీ వివేక్చంద్ర(110 మీటర్స్ హార్డిల్స్, బ్రౌంజ్), బాలికలు అండర్-18లో ఏ ప్రణతి లలిత(100 మీటర్స్ హార్డిల్స్, గోల్డ్), కేశవత్ పద్మ(400 మీటర్స్, సిల్వర్), కేశవత్ సింధు(400 మీటర్స్, బ్రౌంజ్), బాయ్స్ అండర్-20లో రాజ్మిశ్రా (10,000 మీటర్స్ రేస్వాక్లో గోల్డ్), ఎండీ మజీద్ పాషా(షార్ట్పుట్, బ్రైంజ్), బాలికలు అండర్-20లో ఎం ఉమ(3000 మీటర్స్, సిల్వర్), తిసాదార(100 మీటర్స్ హార్డిల్స్, గోల్డ్), ఏ మైథిలి(400 మీటర్స్, బ్రౌంజ్), మల్లిక(1500 మీటర్స్, బ్రౌంజ్) ప్రతిభ చూపారు.
రికార్డును తిరగరాసిన అథ్లెట్
కొత్త రికార్డులకు హనుమకొండ జేఎన్ఎస్ వేదికగా మారింది. సోమవారం జరిగిన సౌత్జోన్ అథ్లెటిక్స్ పోటీలో పలువురు క్రీడాకారులు పాత రికార్డులను తిరగరాసి రెండు సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నారు. అండర్-20 బాయ్స్లో హైదరాబాద్కు చెందిన రాజ్మిశ్రా 10,000 మీటర్ల రేస్వాక్ను 46.10.82 సమయంలో పూర్తి చేసి రికార్డు బ్రేక్ చేశారు. గతంలో తమిళనాడుకు చెందిన ప్రనీశ్ 46.31.01 సమయంలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.