లండన్ : ఈ ఏడాది ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్షిణాఫ్రికా నవలా రచయిత డామన్ గాల్గట్ను వరించింది. ఆయన రచించిన ‘ది ప్రామిస్’ నవల అవార్డుకు ఎంపికైంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహిత్య అవార్డుల్లో ఒకటైన బుకర్ ప్రైజ్ కోసం ఇంతకు ముందు 2003, 2010లోనూ ఆయన రచనలు షార్ట్లిస్ట్ అయ్యాయి. ఈ ఏడాది బుకర్ప్రైజ్ రేసులో అమెరికన్ రచయితలు మరోసారి ఆధిపత్యం చెలాయించారు.
ఫైనలిస్ట్లో ముగ్గురు రచయితలు రిచర్డ్ పవర్స్ (బివిల్డర్మెంట్), మ్యాగీ షిప్స్టెడ్ (గ్రేట్ సర్కిల్) ప్యాట్రిసియా లాక్వుడ్ (నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్)తో పాటు శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రసంగం (ఏ పాసేజ్ నార్త్), బ్రిటీష్ అండ్ సోమాలి నవలా రచయిత నదిఫా మొహమ్మద్ (ది ఫార్చ్యూన్ మెన్) రచనలు బుకర్ప్రైజ్ కోసం పోటీపడ్డాయి.
న్యాయనిర్ణేతలు ‘ది ప్రామిస్’ నవలపై ప్రశంసలు కురిపించగా.. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికవడంపై డామన్ గల్గట్ హర్షం వ్యక్తం చేశారు. బుకర్ ప్రైజ్కు ఎంపికడంతో 68వేల డాలర్ల నగదు పారితోషకాన్ని డామన్ అందుకోనున్నారు. గతేడాది స్కాట్లాండ్కు చెందిన రచయిత డాగ్లస్ స్టువర్ట్ ‘బుకర్ ప్రైజ్-2020’ అందుకున్నారు. ఆయన రచించిన ‘షగ్గీ బైన్’’ అనే నవల అవార్డుకు ఎంపికైంది.