పంటచేలను నాశనం చేసేవాటిలో కీటకాలూ కీలకమైనవే! అందుకే, వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మందులు వాడిన ఉత్పత్తులు అందుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తూ, ‘డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ.. సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. పంట పొలాల్లోని కీటకాలను నివారించేందుకు ‘సోలార్ లైట్’ పరికరాన్ని తీసుకొచ్చింది. రూ.4 వేలు ధర పలికే ఈ పరికరం.. సాగులో రసాయనాల వినియోగాన్ని, సాగు ఖర్చులను తగ్గిస్తుందని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ సంస్థ చెబుతున్నది.
ఇలా పనిచేస్తుంది..
ఈ పరికరం సౌర విద్యుత్తో పనిచేస్తుంది. ఇందులో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తోపాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటుచేశారు. దీనిని పంట చేనులో పెట్టుకుంటే చాలు. పగలంతా సూర్యకాంతితో బ్యాటరీ చార్జ్ అవుతుంది. రాత్రిపూట ఎల్ఈడీ లైట్ వెలుగులు విరజిమ్ముతుంది. ఈ వెలుగులకు పురుగులు, కీటకాలు ఆకర్షితమవుతాయి. లైట్ వద్దకు చేరుకొని, ఆ కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడి చనిపోతాయి.