అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం రావాల్సిన ఉపరాష్ట్రపతి రైలు ద్వారా సాయంత్రం 5.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
రేపు ట్రస్టులో వివిధ వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారని అధికారులు వెల్లడించారు.