నిర్మల్ అర్బన్, డిసెంబర్ 27 : నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీలోని హరిహర క్షేత్రం అ య్యప్ప ఆలయంలో రజతోత్సవ కార్యక్రమం లో భాగంగా మంగళవారం పడి పూజ నిర్వహించారు. శబరిమల ప్రధాన అర్చకుడు పరమేశ్వరన్ నంబూద్రి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దీక్షాపరులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి-వినోదమ్మ, అల్లోల గౌతం రెడ్డి-దివ్యారెడ్డి దంపతులు, అల్లోల సురేందర్ రెడ్డి దంపతులు, అల్లోల తిరుపతి రెడ్డి దంపతులు, ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, కొరిపెల్లి దేవేందర్ రెడ్డి, గురుస్వాములు తదితరులు ఉన్నారు.
రూ.12 కోట్లతో హరిత హోటల్
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 27 : జిల్లాకేంద్రంలో హరిత హోటల్ నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ తమ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలకు నెలవు అని దీంతో రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి సందర్శకుల సంఖ్య పెరిగిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలు, ఆ ధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక నేపథ్యం గల ప్రాం తాలకు ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత మౌలిక వసతులు పెరిగాయని, అలాగే దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడం, కవ్వాల్ అభయారణ్యం, కడెం ప్రాజెక్టు, కుంటాల, పొచ్చెర జలపాతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు నిర్మల్ పట్టణం కేంద్ర బిందువుగా మారిందని తెలిపారు. దీంతో విశ్రాంతి భవనాల కొరత తీవ్రంగా ఉందని, తగిన మౌళిక వసతులతో రూ. 12 కోట్లతో జిల్లాకేంద్రంలో అధునాతన హరిత హోటల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.