కూడవెల్లికి కొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్
మండు వేసవిలో సాగునీటి విడుదల
వేలాదిమంది రైతులకు మేలు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
గజ్వేల్ మండల సింగాటం, చందాపూర్ చెక్డ్యాం వద్ద పూజలు
గజ్వేల్ అర్బన్/రూరల్/తొగుట, మార్చి 26 : ‘గండు కరువులో కూడవెల్లి వాగులోకి నీళ్లు వస్తాయి అనుకున్నారా! నెర్రలు బారిన కూడవెల్లి వాగుకు గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయడంతో చందాపూర్ మొండి మత్తడి వద్ద శుక్రవారం జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు వేలేటి రాధాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్యతో కలిసి గోదావరికి జల హారతి పట్టారు. గజ్వేల్ మండలం సింగాటం గ్రామ చెక్డ్యాం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోమర్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా డప్పుచప్పులు, పూలు, మంగళహారతులతో చెక్డ్యాంకు వచ్చారు. ఎంపీ, ఎఫ్డీసీ చైర్మన్, జడ్పీ అధ్యక్షురాలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిని మహిళలంతా మంగళహారతులతో స్వాగతం పలికారు.
గ్రామం నుంచి ఊరేగింపుగా ప్రజాప్రతినిధులు, ప్రజలు వెళ్లి చెక్డ్యాంలో నిండిన కాళేశ్వరం గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అలాగే సీఎం కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏమోస్తుందని వ్యంగ్యంగా అన్నారని, నేడు గోదావరి జలాలను మనం చూస్తున్నామన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక్సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కూడవెల్లి వాగు ఎండిపోతుండటంతో వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయే ప్రమాదం వచ్చిందని, రైతుల వినతి మేరకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నీటిని విడుదల చేసి, కూడవెల్లివ వాగుకు కొత్త జీవం పోశారన్నారు. రెండు రోజుల్లో దుబ్బాక మండలం చివరి వరకు కూడవెల్లి వాగులోకి నీళ్లు నిండుతాయన్నారు. 70ఏండ్లలో ఎండాకాలంలో కూడవెళ్లివాగులో నీటి వరదను చూడడం ఎప్పుడూ జరుగలేదన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ఇది అద్భుతకార్యం సాధ్యమయ్యిందన్నారు.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ : రోజాశర్మ
సీఎం కేసీఆర్కు రైతులంటే ఎంతో ప్రేమని, రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నాడని ఆమె తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం పట్టించుకోలేదన్నారు. గోదావరి జలాలను కూడవెల్లి వాగులోకి విడవడం చరిత్రలో సువర్ణధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలను పట్టించుకొవద్దని, వాస్తవాలు గ్రహించాలని ఆమె కోరారు.కూడవెల్లి దారి పొడుగునా ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు.
చేతల ప్రభుత్వం ఇది.. : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు
ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుదని, ఇది చేతల ప్రభుత్వమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు అన్నారు. కూడవెల్లి వాగులోకి నీళ్లను విడుదల చేయడం చారిత్రాత్మకమని, వేలాది మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు, ఎఫ్డీసీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు వేలేటి రాధాకృష్ణశర్మ, బక్కి వెంకటయ్య కూడవెల్లి వాగులో ప్రత్యేక పూజలు చేశారు. కూడవెల్లి ప్రవాహాన్ని వారు తన్మయం చెందారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి వాగులో క్షీరాభిషేకం చేశారు. ఎంపీని డప్పు చప్పుల్లతో, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. తొగుటలో మీసేవా కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితాలక్ష్మారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కనకయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కంకణాల నర్సింహులు, సర్పంచ్లు బొడ్డు నర్సింహులు, సిరినేని గోవర్ధన్, పాగాల కొండల్రెడ్డి, పాత్కుల లీలాదేవి, సింగాటం వద్ద సర్పంచ్ లలిత, ఏఎంసీ అధ్యక్షురాలు అన్నపూర్ణాశ్రీనివాస్, మండల అధ్యక్షుడు మధు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.