సిరిసిల్ల రూరల్, మార్చి 31: బుడిబుడి అడుగులు.. చిట్టిపొట్టి మాటలతో సందడి చేసే రెండున్నరేండ్ల బాలుడికి పెద్ద కష్టం వచ్చింది. కాలేయ సంబంధ వ్యాధిబారిన పడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుచేసి రూ. 15 లక్షలు ఖర్చుచేసి ఇప్పటికే పలు దవాఖానల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లివర్ మార్పిడి చేయాలంటే రూ. 20 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్కు చెందిన చింతలపల్లి భాస్కర్రెడ్డి – ఝాన్సీ దంపతులకు ఇద్దరు కొడుకులు చరణ్రెడ్డి (8), సిద్ధార్థరెడ్డి(2). చిన్న కొడుకు ఏడాది నుంచి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు.
భాస్కర్రెడ్డి కొంత భూమిని అమ్మి, అప్పులు చేసి కరీంనగర్, హైదరాబాద్లోని పలు దవాఖానల్లో చికిత్స చేయించినా ఆరో గ్యం కుదటపడలేదు. బాలుడికి లివర్ మార్పిడి చేయాలని రూ. 20 లక్షలు ఖర్చవుతుందని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాతలు ముందుకువచ్చి తమ బాబు వైద్యానికి సాయం అందించాలని వేడుకొంటున్నారు. సాయం చేయాల్సినవారు.. చింతలపల్లి ఝాన్సీ, బ్యాంకు అకౌంట్ నంబర్ 052810100360194, ఐఎఫ్ఎసీ కోడ్ UBIN0805289, న్యూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ సిరిసిల్ల, వివరాల కోసం 9573397610 నంబర్లో సంప్రదించాలని కోరారు.