హరారే: జింబాబ్వేతో జరుగుతున్న మూడవ వన్డేలో.. శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికి ఇది నాలుగవ అర్థ సెంచరీ. గిల్ 51 బంతుల్లో 50 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. కెప్టెన్ రాహుల్, ధావన్లు ఓపెనింగ్ చేశారు. రాహుల్ 30 రన్స్ చేసి ఔటవ్వగా.. ధావన్ 40 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 63 రన్స్ జోడించారు. ప్రస్తుతం గిల్, ఇషాన్ కిషణ్ క్రీజ్లో ఉన్నారు. ఇండియా 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. గిల్ 65, ఇషాన్ 30 రన్స్ చేసి క్రీజ్లో ఉన్నారు.