హుజురాబాద్: మండలంలోని సిర్సపల్లి శ్రీరాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే గర్భగుడిలోని శివుడికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ అనంతరం అర్చక బృందం కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కల్యాణాన్ని వీక్షించారు. విగ్రహాల దాతలు తూముల పద్మ, వెంకట్ రావు దంపతులు కల్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొంటున్నారు.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్సపల్లిలో రాజరాజేశ్వర ఆలయాన్ని ఆయన సందర్శించారు. మంత్రి వెంట గ్రామ ఉపసర్పంచ్ తూముల చొక్కారావు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.