ఇండియన్ పోలీస్ ఫోర్స్ పవర్ చూపిస్తున్నానంటున్నది బాలీవుడ్ తార శిల్పా శెట్టి. ఆమె పోలీస్ అధికారిగా వెబ్ సిరీస్లో కనిపించబోతున్నది. ఈ వెబ్ సిరీస్ను దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్నారు. సిద్దార్థ్ మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించడానికి ఇష్టపడతా. ఈసారి కూడా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తానని నమ్ముతున్నా’ అని చెప్పారు. ‘ఓటీటీ వేదిక మీదకు రావడం థ్రిల్లింగ్గా ఉంది. పవర్ఫుల్ పోలీస్గా ఆకట్టుకుంటా’ అని సోషల్ మీడియాలో పేర్కొంది శిల్పా శెట్టి. ప్రస్తుతం చిత్రీకరణలో ఉందీ వెబ్ సిరీస్.